V6 News

వాహనదారులు హెల్మెట్ ధరించాలి

వాహనదారులు హెల్మెట్ ధరించాలి

మహబూబాబాద్/ ములుగు/ అశ్వారావుపేట/ కూసుమంచి/ ఖిలా వరంగల్​(మామునూరు)/ కాశీబుగ్గ, వెలుగు: వాహనదారులు హెల్మెట్​ ధరించాలని ఆఫీసర్లు వాహనదారులకు సూచించారు. అరైవ్​ అలైవ్​ ప్రోగ్రామ్​లో భాగంగా బుధవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ అధికారులు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహబూబాబాద్​లో ఎస్పీ శబరీశ్​తన కుమార్తెతో కలిసి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఎస్పీ రోహిత్​రాజ్​ట్రాఫిక్​ నిబంధనలపై అవేర్నెస్​ కల్పించారు.

కూసుమంచిలో ఏఎస్పీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో స్కూల్, కాలేజీ బస్సు డ్రైవర్లకు డ్రంక్​అండ్​డ్రైవ్​ టెస్ట్​లు చేసి భద్రతపై పలు సూచనలు చేశారు. వరంగల్​లో కలెక్టర్​ సత్యశారద ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉర్సు రంగలీలా మైదానం కూడలి వద్ద పోలీసు ఆఫీసర్లు, అధికారులు, విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి సోషల్​వెల్ఫేర్, గోవిందరావుపేట మండలం పస్రాలోని పలు పాఠశాలల్లో పోలీసు, రవాణా శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టగా, ఎస్పీ సుధీర్​రాంనాథ్​కేకన్​ పాల్గొని పలు సూచనలు చేశారు.​